Subscribe Us

header ads

లైన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం నూతన అధ్యక్షులుగా చనుమోలు నాగభూషణం


మైలవరం :లయన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం నూతన కార్యవర్గాన్ని సోమవారం పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ (పి ఎం సి సి) ఎస్ వి ఎన్ నివృత్ రావు అధ్యక్షతన ఎస్వీఎస్ హౌస్ నందు జరిగింది. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం అధ్యక్షులుగా చనమోలు నాగభూషణం, సెక్రటరీగా శీలం రామిరెడ్డి, ట్రెజరర్ గా చలువాది గుప్త హరీష్ కుమార్, జోన్ చైర్మన్ (జెడ్ సి) గా తిరుమల శెట్టి శ్రీధర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 ఈ సందర్భంగా ఎస్ వి ఎన్ నివృత్ రావు మాట్లాడుతూ.. లై నిజమనేది ప్రపంచవ్యాప్తంగా ఉందని, లై నిజమంటే సేవ చేయటం అన్నారు. గతంలో మైలవరం లైన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు డయాలసిస్ కేంద్రం, వైకుంఠధామం, ఉచిత కంటి పరీక్షల శిబిరం వంటి పర్మినెంట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేశామన్నారు. అలాంటి ప్రాజెక్టులు చిరస్థాయిగా గుర్తుండిపోతాయన్నారు. మైలవరం లైన్స్ క్లబ్ ద్వారా ముందు ముందు గుర్తుండి పోయేలామరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. 

ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని అభినందించారు. అభినందించిన వారిలో పి ఎం సి సి ముల్పూరి ఉపేంద్ర, జిల్లా గవర్నర్ గద్దె శేషగిరి, జోన్ చైర్మన్ జాస్తి వెంకటేశ్వరరావు , డాక్టర్ సిహెచ్ బాలగోపాల్ రెడ్డి,, లైన్స్ మెంబర్లు లేళ్ల ఏడుకొండలు, తాడేపల్లి వెంకటేశ్వరరావు , మేడసాని కిషోర్, పి రాజారెడ్డి, మద్దినేని శ్రీను,ఆలమూరు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.