Subscribe Us

header ads

పాతపట్నం లో ఘనంగా జాతీయ గ్రంధాలయ దినోత్సవం…


శ్రీకాకుళం :శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో స్థానిక శాఖా గ్రంధాలయం నందు రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవం ఎస్సార్ రంగనాథన్ జన్మదినోత్సవం సందర్భంగా వివిధ మండల జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రంథ పాలకులకు సన్మాన కార్యక్రమము నిర్వహించారు. ముందుగా గ్రంథాలయ శాస్త్ర పితామహులు ఎస్సార్ రంగనాథన్ చిత్రపటమునకు హిరమండలం ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతరావు,సి.హెచ్.సి .పాతపట్నం సూపరిండెంట్ ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ జి వేణుగోపాల్,జిల్లా గ్రంథాలయ సంస్థ శ్రీకాకుళం కార్యదర్శి బుర్రె కుమార్ రాజు, పాతపట్నం యూత్ నాయకులు సైలాడ సతీష్ పూలమాలయంకరణ గావించారు.

 ముందుగ సాహితీ వేదిక అధ్యక్షులు బంధన శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మహేంద్ర కళాశాల అధిపతి శాసనపురి మధుబాబు, రిటైర్డ్ ఎంపీడీవో సలాన చిరంజీవులు, డాక్టర్ మల్లికార్జున్, ఏపీజీవీబీ రిటైర్డ్ బ్రాంచ్ మేనేజర్ ఎం బాబురావు, రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధినేత పారశెల్లి రామరాజు బహుమతులను అందజేశారు.

 అనంతరం లైబ్రెన్స్ డే ని పురస్కరించుకొని వివిధ మండల లైబ్రేరియన్స్ విశ్రాంత గంధ పాలకులు తమిరి వైకుంఠ రావు, సంతబొమ్మాలి గ్రంథపాలకులు కే రామకృష్ణ, మెలియాపుట్టి గ్రంథ పాలకులు ఆర్ అనురాధ, హిరమండలం గ్రంథా పాలకులు కే ఎర్రమ్మ, టెక్కలి గ్రంథపాలకులు రూపవతి, నందిగాం గ్రంథ పాలకులు ఉదయ్ కిరణ్, పలాస గ్రంథపాలకులు రాంబాబులకు మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బూరె కుమార్ రాజు, డిప్యూటీ లైబ్రేరియన్ వి వి జి ఎస్ శంకర్రావు లకు సన్మానం చేసారు.ఈ కార్యక్రమంలో బుల్లి బాబు, వసంత్, రామారావు, మన్మధరావు, ధనుంజయ, నట్టు బాబు, ఇతరులు పాల్గొనగా కార్యక్రమాన్ని పాఠకులు దుర్గారావు, ఉపేంద్ర, గణేష్, ప్రవీణ్, పవన్, బి డి సి నిర్వహకులు సింహాచలం, రామారావు, ప్రభాకర్, గంగయ్య సహకరించారు.శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న నిత్య యోగ లో పాల్గొని ఈరోజు నిర్వహించిన పోటీలలో విజేతగా ఫస్ట్ తులసి రావు, సెకండ్ జీవరత్నం, థర్డ్ మధుబాబు, కౌన్సిలేషన్ కళ్యాణ్ కి బహుమతులతో సత్కరించారు..ఈ కార్యక్రమం గ్రంథాలయ అధికారి కాళ్ళ రాజు అధ్యక్షతన జరుగగా పారశెల్లి రామరాజు వందన సమర్థనతో ముగిసినవి.