సాలూరు
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రవికుమార్ మాట్లాడుతూ మక్కువ ప్రాంతం మీదుగా మూడు బస్సులు నడిచేవి అని అన్నారు.రోడ్లు బాగోలేదు అని కారణంతో రెండు బస్సులు నిలిపివేయడం జరిగింది. బస్సులను నిలిపివేయ్యడం వలన విద్యార్థులు,ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులకు పడుతున్నారన్నారు.ప్రధానంగా విద్యార్థులు సమయానికి స్కూలు కు వెళ్లలేక, సమయనికి స్కూల్ నుండి ఇంటికి రాలేక, ఉన్న ఒక్క బస్సులో ప్రయాణికులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ప్రయాణించలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు.తక్షణమే వారి సంక్షేమాన్ని ఆలోచించి బస్సులు యధావిధిగా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన శాఖ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్పందిస్తూ వారం రోజులలో,రోడ్లు మరమ్మత్తులు పూర్తిచేసి బస్సులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హరికృష్ణ, గౌతమ్,దుర్గా,వికాస్ తదితరులు పాల్గొన్నారు.