పెదవేగి:-
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నాం - వంద రోజులు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వ పనితీరుకు ప్రజల ఆమోదం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్య. ఏలూరుజిల్లా దెందులూరు నియోజక వర్గ సమగ్ర అభివృద్ది, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నీ పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు.
నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకుందని, గత 5 ఏళ్ళ వైసిపి పాలనలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన ఎన్నో గ్రామ సమస్యలను ఈ వంద రోజుల్లో పరిష్కరించి ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన మీకోసం - మీ చింతమనేని కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించిందని, గ్రామ సమస్యలను ప్రజల సమక్షంలోనే పరిష్కారం చూపిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక ఫించన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి నాయకుల అధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈకార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు), లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, నంబూరి నాగరాజు, పార్టీ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.