ఏలూరు:-
ఏలూరుజిల్లా శుక్రవారం ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీని కలిసి నియోజకవర్గంలో గుర్తించిన ఉపాధి పనుల వివరాలను సమర్పించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. గ్రామాల్లో ప్రజలు వలసలు వెళ్లకుండా నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పథకంలో చిన్న సన్న కారు రైతుల భూముల్లో అభివృద్ధి పనులకు, గ్రామాల్లోని స్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధులు కేటాయించాలని అన్నారు.
కలెక్టర్ స్పందిస్తూ స్థానికంగా ఉన్న చెరువు పూడికతీత పనులు చేపట్టాలని, యంత్రాలతో పనులు చేయించకూడదని సూచించారు.
ఇంకా దాదాపు చాలా రకాలైనటువంటి పనులున్నాయి. వాటిని ఉపాధి కూలీల ద్వారానే చేసి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే ని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కోరటం జరిగింది