చాట్రాయి:
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలపై ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో నూజివీడు సీఐ కే రామకృష్ణ మరియు చాట్రాయి సబ్ ఇన్స్పెక్టర్ డి రామకృష్ణ వారి సిబ్బంది కలిసి నేర నియంత్రణలో భాగంగా ఏలూరు జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లా మోటార్ సైకిళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్న పోలవరం గ్రామానికి చెందిన కోట రవి (29సం:)తండ్రి వెంకటేష్ ను బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజర పరుస్తున్నట్లు నూజివీడు సీఐ కే రామ కృష్ణ పత్రిక సమావేశంలో తెలిపారు.కోట రవి అనే అతను సుమారు ఐదు లక్షలు విలువ గల 12 మోటార్ సైకిల్స్ నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ మొత్తం 13 మోటార్ సైకిళ్ళు ఒక మేకపోతు దొంగిలించాడని,అతనిపై క్రైమ్ నెంబర్255, 257,258,259,/2024 u/s303(2) క్రింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఒక మోటార్ సైకిల్, ఏలూరు టూ టౌన్ పరిధిలో 8 మోటార్ సైకిళ్ళు, చాట్రాయిలో ఒక మేకపోతు మూడు మోటార్ సైకిల్లు, దొంగిలించాడని మొత్తం రికవరీ చేసికోర్టులో పెడుతున్నామని తెలిపారు. దొంగి లించిన మోటార్ సైకిల్ లను రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన చాట్రాయి ఎస్ ఐ డి రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ ఎం విజయ భాస్కర్, కానిష్టేబుల్ విష్ణు కుమార్, కే గిరిబాబు లను నూజివీడు రూరల్ సీఐ కే రామకృష్ణ అభినందించి నగదు పారితోషం ప్రకటించారు.