బుట్టాయిగూడెం:-
ఏలూరుజిల్లా బుట్టాయిగూడెం మండలంలో 4 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ. రాష్ట్రవ్యాప్తంగా పల్లెపండుగ పేరుతో ఒకేసారి రికార్డు స్థాయిలో సిమెంట్ రహదారుల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనుల నిర్వహణకు చర్యలు తీసుకోవడం ఓ చారిత్రక ఘట్టమని పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు పేర్కొన్నారు.
రహదారుల అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు సోమవారం భూమి పూజ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వీటిని నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ఈ పల్లెపండుగలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 4,500 కోట్లతో 30,000 పనులను చేపట్టనుందన్నారు. రాష్ట్రంలోని 13,324 గ్రామాల్లో ఒకేసారి నిర్వహించనున్నారు, ఇది గ్రామీణ అభివృద్ధికి పెద్ద దోహదం చేసే అవకాశం ఉందన్నారు.
ఈకార్యక్రమంలో ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు,జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి,జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగ కృష్ణ,జిల్లా కార్యదర్శి గడ్డమును రవికుమార్,మండల అధ్యక్షులు మెట్ట బుచ్చిరాజు,ఎమ్మార్వో, ఎంపీడీఓ,ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.