Subscribe Us

header ads

జనార్ధనవరంలో ఆర్ అండ్ బి రోడ్డు గుంతలు పూడ్చండి మహాప్రభో......


 చాట్రాయి :-
 ఏలూరు జిల్లా చాట్రాయి మండలం జనార్ధన వరం నుండి మండల కేంద్రమైన చాట్రాయికి వెళ్ళు ఆర్ అండ్ బి రోడ్డు పూర్తిగా ధ్వంచమై వాహన దారులు, కాలినడక బాటసారులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదు ర్కొంటున్నారు. జనార్ధన వరంలో రైస్ మిల్ పరిధి లోను, మాలపల్లి వద్ద, చాట్రాయి గొల్లగూడెం వద్ద మొత్తం మూడు చోట్ల పెద్ద పెద్ద భారీ గుంతల పడి ఆ రోడ్డులో ప్రజలు ప్రయాణించటానికి నరక యాతన పడుతున్నా పట్టించుకొనే నాదుడే లేడని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. కనీసం గుంతలైనా పోర్చండి మహాప్రభువు అంటూ జనార్ధనవారం,ఆరుగొలనుపేట, చిత్తపూరు తుమ్మ గూడెం, సోమవరం, కొత్తగూడెం గ్రామాల ప్రజలు ప్రభుత్వ అధికారు లకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకొనుచున్నారు. ఎదురు బదురుగా వస్తున్న వాహనాలు సైతం తప్పుకొనే పరిస్తితి లేక మోటారు సైకిళ్ళు గుంతలో పడి అనేక మంది గాయాల పాలవు తున్నారు. 

గృహ నిర్మాణ శాఖ, మరియు సమాచార శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గం లోని చాట్రాయి మండలంలోని రోడ్ల దుస్థితి ఇంత దారుణంగా ఉండటం బాధాకరమని ప్రజలు అంటున్నారు. మండల కేంద్రమైన చాట్రాయికి చిత్తపూరు,ఆరుగొలనుపేట, అటు కొత్తగూడెం సోమవారం తుమ్మగూడెం ప్రజలు వివిధ పనుల పైన వెళ్లాలంటే ప్రధానమైన రోడ్డు ఇదే, ఇప్పటికైనా మంత్రిగారు చొరవ తీసుకుని ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి కనీసం రోడ్డుపై పడిన పెద్ద పెద్ద గుంతలు పూడ్పిం చాలని, రోడ్డుకు ఇరు వైపులా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.