Subscribe Us

header ads

ఘనంగా ప్రపంచ పాస్టర్ల దినోత్సవం

 గోకవరం:-

ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల రెండవ ఆదివారం ప్రపంచ పాస్టర్ల దినోత్సవంప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.  కృష్ణునిపాలెం EHH పరిశుద్ధ దేవాలయంలో సంఘ సభ్యులందరు సంఘ కాపరి రెవ. జుహాని హలోనెన్ దంపతులను శాలువాలు,పూల దండలు,బొకేలతో ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరు తమ దైవజనుని అభినందిస్తూ బహుమతులు అందజేశారు.సంఘ పెద్దలు మేడి జాన్,ఎన్నేటి పాల్,జంగేటి శాంతిరాజు,కొల్లపు చిన్నారావు, ఎద్దు అన్నవరం మరియు గ్రూప్ లీడర్లు ఆధ్వర్యంలో దైవసేవకుని అభినందన సభ అత్యంత ఘనంగా జరిగింది.తమను ప్రేమతో సన్మానించిన సంఘ సభ్యులందరికి రెవ. జుహాని హలోనెన్ దంపతులు కృతజ్ఞతలు తెలియజేసారు.