ఇ-క్యాబినెట్ సమావేశం లో పలు అంశాలు
అమరావతి :ది.15–04–2025 మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర జల వనరులు,సాంఘిక సంక్షేమం,హోం,పర్యాటక శాఖల మంత్రులు డా.నిమ్మల రామానాయుడు,డా.డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత,కందుల దుర్గేశ్ లు మీడియాకు వివరించారు..
1.సాంఘిక సంక్షేమం:
సమాజంలో వివిధ ఉప కులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల మధ్య ఉప-వర్గీకరణను అమలు చేయటానికి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనకు రాష్ట్ర మండలి ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణను అమలు చేయడానికి చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్కు ఆమోదం లభించింది. సమాజంలో అన్ని షెడ్యూల్డ్ కులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈఆర్డినెన్స్ ముఖ్య ఉద్దేశ్యం.
రాష్ట్రంలోని 59 షెడ్యూల్డ్ కులాలను జనాభా,వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది.
ఈ మూడు కేటగిరీలకు రిజర్వేషన్ల శాతం క్రింది విధంగా నిర్ణయించబడింది:
గ్రూప్-I (12 కులాలు): 1% రిజర్వేషన్
• బవురి, చచాటి, చండాల, దండాసి, డొమ్, ఘాసి, గొడగలి, మెహతర్, పాకి, పామిడి, రెల్లి, సాప్రు
గ్రూప్-II (18 కులాలు): 6.5% రిజర్వేషన్
• అరుంధతీయ, బిందల, చమార్, చంభార్, దక్కల్, ధోర్, గొదారి, గోసంగి, జగ్గాలి, జంబువులు, కొలుపులవండ్లు, మాదిగ, మాదిగ దాసు, మాంగ్, మాంగ్ గరోడి, మాతంగి, సమగార, సింధోలు
గ్రూప్-III (29 కులాలు): 7.5% రిజర్వేషన్
• ఆది ద్రావిడ, అనముక్, అరయ మాల, అర్వ మాల, బారికి, బ్యాగర, చలవాది, ఎల్లమలవార్, హోలేయ, హోలేయ దాసరి, మదాసి కురువ, మహర్, మాల, మాల దాసరి, మాల దాసు, మాల హన్నాయి, మాలజంగం, మాల మస్తి, మాల సాలె, మాల సన్యాసి, మన్నే, ముండల, సంబన్, యాతల, వల్లువన్, ఆది ఆంధ్ర, మస్తి, మిట్టా అయ్యలవార్, పంచమ
ఈ ఉపవర్గీకరణ కోసం 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను అనుసరించడం జరుగుతుంది.ఇది రెండు సైకిల్స్ లో(ఒక్కొక్కటి 1-100 వరకు) పనిచేస్తుంది.ఈ ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని అన్ని షెడ్యూల్డ్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధిని నిర్ధారించగలమని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అమల్లోకి వస్తుంది.
2. పరిశ్రమలు & వాణిజ్యం:
వివిధ పరిశ్రమలు మరియు ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమల పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా 10.04.2025న జరిగిన SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం కోసం ప్రతిపాదన, వాటికి అవసరమైన భూముల కేటాయింపు, సక్రమంగా ఆమోదించడం,మౌలిక వసతులను కల్పించడం మరియు సంబంధిత విధి విధానాల ప్రకారం ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీని విస్తరించడం వంటి అంశాలపై పరిశ్రమలు, వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదించింది.
స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) జులై 2024 నుండి ఐదుసార్లు సమావేశమై రాష్ట్రంలో వ్యాపారనుగుణ వాతావరణ వేగాన్ని పెంచడానికి రాష్ట్రం యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తోంది.ఇప్పటివరకు, SIPB ద్వారా 4.23 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన లక్ష్యంతో రూ. 4.62 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ఆమోదించింది.
3.పరిశ్రమలు & వాణిజ్యం (గనులు):
ఒప్పందం సమయంలో పనిచేయని కాలానికి పరిహారం చెల్లించడానికి ఎటువంటి అదనపు చెల్లింపు అవసరం లేకుండా ఏడు పూర్వ జిల్లాల (శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, గుంటూరు,చిత్తూరు,కడప,అనంతపురం)సీనరేజ్ ఫీజు వసూలు కాంట్రాక్టుల కాంట్రాక్ట్ వ్యవధిని పొడిగించడానికి ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ చిన్న ఖనిజాల విధానం 2025 ను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు.ఈ విధానం ద్వారా రాష్ట్రంలో ఖనిజ ఉత్పత్తులు పెరగడం,పెట్టుబడి దారులను ఆకర్షించడం,కార్యకలాపాలను పెంచడం,సుస్థిర గణన పద్ధతులను ప్రోత్సహించడం,అనుసరణను సరళీకరించడం,పాత సమస్యలను పరిష్కరించడం, పారదర్శక సాంకేతిక నియంత్రణను అమలు చేయడం మరియు రాష్ట్ర ఖజానాకు నిశ్చితమైన ఖనిజ ఆదాయాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.
4. పరిశ్రమలు & వాణిజ్యం:
GO Ms No.49, 50 & 51ల ద్వారా పరిశ్రమలు,వాణిజ్య శాఖ 09.04.2025 లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను ధృవీకరించుటకు ఆమోదం కోసం ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఈ నిర్ణయం వల్ల పరిశ్రమలు మరియు వాణిజ్యం (ఎం-III) శాఖ APMDC యొక్క ఆర్థిక బలం మరియు క్రెడిట్ ను మెరుగుపర్చుతుంది.అలాగే రూ.9,000 కోట్ల బాండ్లను జారీ చేయడానికి అనుమతించే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది.
ఈ ప్రతిపాదన ప్రకారం APMDC ను "పబ్లిక్" కంపెనీగా మార్చడం,ప్రస్తుత వాటాదారులకు అదనంగా నలుగురు అధికారులను వాటాదారులుగా నియమించడం మరియు కంపెనీ యొక్క మెమొరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో అవసరమైన మార్పులు చేయడం వంటి చర్యలు చేపట్టబడతాయి.ఈ చర్యల వలన APMDC ఆర్థిక స్థితి బలోపేతమై, మెరుగైన సేవలు అందించగలదు.
5.ఐటిఇ అండ్ సి
విశాఖపట్నంలోని ఐటి హిల్ నం.3లో రూ.1,370 కోట్ల పెట్టుబడితో ఐటి క్యాంపస్ ఏర్పాటు కోసం మరియు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్కి మొత్తం 21.16 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అదే విధంగా విజయనగరంలో మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా సమగ్ర ఉక్కు ప్లాంట్ విస్తరణ మరియు శ్రీసిటీ తిరుపతిలో ప్రొటేరియల్ లిమిటెడ్ ద్వారా అమోర్ఫస్ మెటల్ తయారీ సదుపాయం ఏర్పాటు,విశాఖపట్నంలో అర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా డేటా సెంటర్ మరియు ఐటి కార్యాలయ స్థలం మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ద్వారా కొత్త ఐటి క్యాంపస్ కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గ ఆమోదం లభించింది
.
6.ఐటిఇ అండ్ సి.
విశాఖపట్నంలోని హిల్ నం.3 (SEZ)లోని IT పార్క్లో 3.5 ఎకరాల భూమిని M/s URSA క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ప్రస్తుతం అమలులో ఉన్న నియమాల ప్రకారం కేటాయింపు కోసం ప్రతిపాదన మరియు IP కాపులుప్పాడలో 56.36 ఎకరాల భూమిని M/s URSA క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ప్రస్తుతం అమలులో ఉన్న నియమ నిబంధనల ప్రకారం కేటాయించెందుకు చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
7. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ :
సీఆర్డీఏ పరిధికి సంబంధించిన రెండు (2) పనులకు L1 బిడ్లను ఆమోదించడానికి APCRDA కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదన,అంటే (a) శాసనసభ భవనం (రూ.617.33 కోట్లు); మరియు (b) హైకోర్టు భవనం (రూ.786.05 కోట్లు),ఈ పనులను L1 బిడ్డర్లకు అప్పగించడానికి LOA జారీ చేయడం మరియు APCRDA అథారిటీ వారి తీర్మానం నెం.527/2025 & 528/2025 ద్వారా ఆమోదించిన నిర్ణయాలను అమలు చేయడానికి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
8. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ:
రాష్ట్రంలో డేటా-ఆధారిత ప్రణాళిక & సామర్థ్య నిర్మాణం ద్వారా వాతావరణ గవర్నెన్స్ మెకానిజమ్లను బలోపేతం చేయడానికి మరియు వాతావరణ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడానికి సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేట్,ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ (CITIIS) 2.0 కార్యక్రమం కింద నగరాల కోసం రాష్ట్ర వాతావరణ కేంద్రం (S-C3) ఏర్పాటుకు ఆమోదం కోసం ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
9.ఇంధన శాఖ.
APCPDCL పరిధిలోని మూడు పాత జిల్లాల్లో మిగిలిన 199 కు సంబంధించిన 11 కేవీ మిశ్రమ వ్యవసాయ ఫీడర్ల విభజన పనులను చేపట్టడానికి మంజూరు చేసిన సవివర ప్రాజెక్ట్ నివేదికలు (DPRs) ను ఆమోదించడానికి మరియు ఆర్డీఎస్ఎస్ కింద పనులు చేపట్టడానికి చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
10.ఇంధన శాఖ.
M/s ఒరిస్సా పవర్ కన్సార్టియం లిమిటెడ్కి రెండు ప్రాజెక్టులు అనగా బలిమేల (చిత్రకొండ) ఆనకట్ట పవర్ హౌస్ (2x30 MW) మరియు జాలాపుట్ డ్యామ్ పవర్ హౌస్ (3x6MW) కేటాయింపునకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
11.ఇంధన శాఖ.
AP ఏకీకృత స్వచ్ఛ ఇంధన విధానం 2024 కింద కర్నూలు జిల్లాలోని అస్పారిలో 88 MW పవన విద్యుత్ ప్రాజెక్టును స్థాపించడానికి M/s. JSW నియో ఎనర్జీ లిమిటెడ్ అభ్యర్థనపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది.
12. ఇంధన శాఖ.
అనంతపురము జిల్లాలోని గుత్తి మరియు పామిడి మండలాల్లోని గ్రామాల్లో 540 MW AC/753.30 MWp DC సౌర విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించడానికి M/s.రిన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థనపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
13. ఇంధన శాఖ.
శ్రీ సత్య సాయి జిల్లాలోని మడకశిర మండలంలోని హరేసముద్రం, బుల్లసముద్రం,ఉప్పర్లపల్లి,ఎర్రబొమ్మనహల్లి,కల్లుమర్రి మరియు మనూరు మరియు సమీప గ్రామాలలో 2000 MW AC/2500 MWp DC సౌర విద్యుత్ ప్రాజెక్టును BESS తో పాటు స్థాపించడానికి M/s. చింత గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థనపై చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
14.ఇంధన శాఖ.
AP ఏకీకృత స్వచ్ఛ ఇంధన విధానం 2024 కింద తిరుపతి జిల్లాలోని చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నం,తూర్పు కనుపూరు మరియు వెల్లపాలెం గ్రామాలలో మరియు కోట మండలంలోని కర్లపూడి మరియు సిద్ధవరం గ్రామాలలో 700 MW AC/ 875 MWp DC సౌర విద్యుత్ ప్రాజెక్టును BESS తో పాటు స్థాపించడానికి M/s.చింత గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థనపై చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
15. రెవెన్యూ:
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని నడింపాలెం గ్రామంలో గల సర్వే నంబర్ 110-02 లోని 6.35ఎకరాల భూమిని ఉచితంగా(లేదా) నామమాత్రపు లీజు ప్రాతిపదికన ప్రజా ప్రయోజనాల కోసం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కి 100 పడకల ESIC ఆసుపత్రి మరియు సిబ్బంది నివాసాల నిర్మాణం కోసం కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
16. రెవెన్యూ:
ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలంలోని I.S. రాఘవపురం శివారు I.S. జగన్నాధపురంలో గల సర్వే నంబరు 425/193 లో 30.00 ఎకరాల ప్రభుత్వ భూమిని 'శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం' అభివృద్ధి కోసం దేవాదాయ శాఖకు ఉచితంగా కేటాయించడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈకేటాయింపు BSO-24 మరియు G.O.Ms.No.571, రెవెన్యూ (అసెన్-I) డిపార్ట్మెంట్, తేదీ 14.09.2012 ప్రకారం సాధారణ నిబంధనలకు లోబడి, స్థానిక అధికారుల నుండి DPR/NOC కు లోబడి ఉంటుంది.
17. రెవెన్యూ:
చిత్తూరు జిల్లా, కుప్పం మండలం, బైరుగనిపల్లె (V) గ్రామంలోని సర్వే నెంబర్లు 19/17, 19/16, 19/10, 19/18, 19/3, 19/15, 19/11,19/12, 19/14, 19/19, 19/8 & 19/9లలో మొత్తం 1.99 ఎకరాల ప్రభుత్వ భూమిని, అదే గ్రామంలోని సర్వే నెంబర్లు 19/1A, 19/1B1, 19/1B2A1 & 19/1B2Bలో మొత్తం 1.31 ఎకరాల పట్టా భూమితో మార్పిడి చేయడానికి మంత్రివర్గం ఆమోదించింది.ఈ మార్పిడి కేంద్రీయ విద్యాలయ స్థాపన కోసం ఉచితంగా G.O.Ms.No.571, రెవెన్యూ (అసెన్-I) డిపార్ట్మెంట్, తేదీ 14.09.2012 కి అనుగుణంగా BSO-26Aతో సహా ఇతర షరతులకు లోబడి ఉంటుంది.
18. రెవెన్యూ:
SPSR నెల్లూరు జిల్లా,ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీయల్ పార్క్ కు 87.56 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయిస్తూ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
19. రెవెన్యూ:
SPSR నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఇండస్ట్రీయల్ పార్క్ కు 220.81 ఎకరాల ప్రభుత్వ భూమిని APIIC కి ఉచితంగా కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఈ భూ కేటాయింపు BSO-24 మరియు G.O.Ms.No.571, రెవెన్యూ (అసెన్-I) డిపార్ట్మెంట్, తేదీ 14.09.2012 ప్రకారం సాధారణ నిబంధనలకు లోబడి,స్థానిక అధికారుల నుండి NOC సమర్పించడం మరియు APLMA సిఫార్సు చేసిన ఇతర సాధారణ షరతులకు లోబడి ఉంటుంది.ఈ నిర్ణయం S.P.S.R. నెల్లూరు జిల్లాకు వర్తిస్తుంది
.
20. రెవెన్యూ:
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం,రెల్లి గ్రామంలో రాష్ట్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రానికి సర్వే నెంబర్లు 367-1, 368లలో గల 516.58 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరం రూ. 27లక్షలకు కేటాయి స్తూ గతంలో జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 630 ను రద్దు పరుస్తూ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
21.జలవనరుల శాఖ:
2018 ఆగస్టులో సంభవించిన తుఫాన్ కారణంగా కురిచిన భారీ వర్షాలకు యర్రకాల్వ పరివాహక ప్రాంతంలో పడిన గండ్లు ఇతర 48 పునరుద్ధరణ పనులను తాత్కాలిక ప్రాతిపదికన రూ.331 లక్షల అంచనా వ్యయంతో చేసిన పనులకు పోస్ట్ ప్యాక్టో పరిపాలన ఆమోదానికి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
22.జలవనరుల శాఖ:
పూల సుబ్బయ్య వేలిగొండ ప్రాజెక్ట్ లోని II & IV ప్యాకేజీలకు సంబంధించి నల్లమల జలాశయాన్ని నింపడానికి అవసరమైన కీలక పనులకు రూ.106.39 కోట్ల పరిపాలనామోదానికి చేసిన ప్రతిపాదనలకు,"ఫీడర్ కాలువ మరియు తీగలేరు కాలువ హెడ్ వర్క్స్"పనులు కొనసాగించడానికి M/s MEIL, హైదరాబాద్ కు మరియు "తూర్పు ప్రధాన కాలువ యొక్క హెడ్ రెగ్యులేటర్" పనులను M/s SCL ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్, హైదరాబాద్ కు వర్క్ ఆర్డర్ జారీకి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రవర్గం ఆమోదం తెలిపింది.
23. జలవనరుల శాఖ:
పోలవరం ప్రాజెక్ట్ యొక్క మిగిలిన హెడ్ వర్క్స్ పనులు అప్పగించబడిన M/s నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ కు,ఒప్పంద షరతుల ప్రకారం చెల్లించవలసిన రూ.57.56 కోట్ల మొత్తాన్ని మరియు తుది బిల్లుతో పాటు చెల్లించవలసిన రూ.36.37 కోట్ల చెల్లించేందుకు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
24.సాధారణ పరిపాలన శాఖ( ఐ అండ్ పీఆర్):
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పేషీలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఒక వీడియోగ్రాఫర్ పోస్ట్ ను నెలకు రూ.60,000/- పారితోషికంతో నియమించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఈ వీడియోగ్రాఫర్ పదవీ కాలం ఉపముఖ్యమంత్రి పదవీ కాలానికి అనుగుణంగా కొనసాగించబడుతుంది.