ఏలూరుజిల్లా శ్రావణ మాస ఉత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలుతీర్చి , భక్తుల పాలిటి కొంగుబంగారమై పట్టణ ఇలవేల్పు దేవతగా వేంచేసియున్న శ్రీ నూకాలమ్మ అమ్మ వారు శ్రావణ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా లక్ష గాజుల విశేష అలంకరణలో దర్శనమిచ్చారు.
శ్రీ నూకాలమ్మ అమ్మ వారి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీజలాలు మరియు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకాదశ హారతి పూజలు, వేదదర్బారు సేవ, చతుర్వేద స్వస్తి , నీరాజన మహా మంత్ర పుష్పం మరియు సాయం సంధ్యా హారతి పూజలు అర్చకస్వాములు నిర్వచహించారు.
ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ, అమ్మ వారి రజత వస్త్రం తయారీకి జెట్టిబోయిన సత్యనారాయణ వసుంధర దంపతులు 5తులాల వెండిని, పాలడుగుల శ్రీను జ్యోతి దంపతులు 5తులాల వెండిని, దర్నాలకోట శ్రీనివాస్ రాణి దంపతులు 5తులాల వెండిని మరియు ఆలయ అభివృద్ధికి నామ ఉమామహేశ్వరరావు దేవీ కుమారి దంపతులు రూ 10,116/ లు, అప్పసాని రుద్రాన్ష్ నాగ అద్విత్ పుట్టిన రోజు పురస్కరించుకొని రూ 5,116/ లు ఆలయ అభివృద్ధికి సమర్పించారు అని వారినీ వారి కుటుంబాలను వారి వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలను అమ్మ వారు ఎల్లవేళల కాచి కాపాడాలని కోరారు.
ది 30.8.24 నాల్గవ శ్రావణ శుక్రవారం అమ్మ వారు వివిధ రకాల పండ్ల అలంకరణలో దర్శనమిస్తారని ఇదే మా ఆహ్వానంగా భావించి, శ్రీ నూకాలమ్మ అమ్మ వారిని దర్శించి, కుంకుమ పూజలలో పాల్గొని,తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అమ్మ వారి అనుగ్రహం పొందాలని ఆహ్వానము పలికారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని భక్తులకు యే విధమైన ఇబ్బంది కలగకుండా చూచి ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారు.