Subscribe Us

header ads

తాడేపల్లి ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు


తాడేపల్లి :తాడేపల్లి ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసులో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. 

ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకులకు చైర్ పర్సన్ ఫర్ ఎస్సీ (మాదిగ)
డా. ఉండవల్లి శ్రీదేవీ గారు హాజరై ప్రసంగించారు.


యావత్ ప్రపంచానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసారు..దేశ రక్షణ కోసం సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి నిలుస్తారని, ఏసు ప్రభు మన పాపాలను తొలగించడానికి తన ప్రాణాలను వదిలారన్నారు. సెమి క్రిస్టమస్ వేడుకల నిర్వహణ ద్వారా సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందన్నారు. 


సర్వమత సమ్మేళనంగా భారత దేశం ఉంటుందని, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పధకాలు అందిస్తున్నారన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు.

 ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, ప్రజలు, ఏమార్పిఎస్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.