Subscribe Us

header ads

పొలం పిలుస్తోంది కార్యక్రమం తో రైతులకు అవగాహన ...


 సాలూరు:

బుదవారం సాలూరు నియోజక వర్గం పరిధి లో మావుడి, కందులపదం రైతు సేవా కేంద్రాల పరిదిలో వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దశపర్ని కషాయం ,జిల్లేడు కషాయం తయారీ మరియు వాటి వినియోగం వల్ల కలిగే ఉపయోగాలు గురించి రైతులకు మండల వ్యవసాయ అధికారి అనూరాధ పండా వివరించారు.
 అలాగే హార్టికల్చర్ ఆఫీసర్ బి. ఝాన్సీ అరటి,ఆయిల్ పామ్ ఇంకా జీడి మామిడి లో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. 
వెటర్నరీ డాక్టర్ కె. ప్రభాకర్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ఆవులు , గేదెలు మరియు గొర్రెలు పెంపకం లో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రైతులకు అవగాహన కల్పించారు.
రైతులకు సబ్సిడి లో టార్పలిన్స్ , స్ప్రేయర్లు , ట్రాక్టర్ అనుబంధ పరికరాలు సబ్సిడీలో కల్పించమని గ్రామ పెద్దలు అధికారులను కోరారు. 
ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచ్లు, గ్రామ పెద్దలు, ఎపి సి ఎన్ ఎఫ్ సిబ్బంది, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయుకులు , గ్రామ రైతులు పాల్గొన్నారు