Subscribe Us

header ads

నిండుకుండలా మారిన శ్రీ కరాటం జలాశయం.


జంగారెడ్డిగూడెం

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం వినాయక చవితి నేటికీ పండుగ ప్రారంభమై మూడో రోజు కావడంతో. నేడు నిమజ్జనాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. జంగారెడ్డిగూడెం మండలంలోని కొంగవారిగూడెం లో ఉన్న శ్రీ కరాటం జలశయం వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో వినాయకుని నిమజ్జనం కార్యక్రమాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్వయంగా జంగారెడ్డిగూడెం ఆర్డీవో డి.ఎస్.పి. తాసిల్దార్. లక్కవరం పోలీసులు నిమజ్జనాలు జరిగే ప్రాజెక్టు ప్రదేశాన్ని ముందుగా గుర్తించి రాత్రి సమయంలో వచ్చే భక్తుల కోసం లైటింగ్ ఏర్పాటు చేశారు.

అలాగే పోలీసులు ఆలయాల కమిటీ వారిని హెచ్చరిస్తూ విగ్రహాలు నిమజ్జనాలు జరిగేటప్పుడు పెద్దవాళ్లు మాత్రమే నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని. యువకులు ఎవరు కూడా నిమజ్జన కార్యక్రమంలో అత్యుత్సాహంతో స్థానాలు చేయడానికి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రాజెక్టు నిండుకుండలా ఉండడంతో నిమజ్జల కార్యక్రమాలకు వచ్చే వారందరూ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు భక్తులందరూ సహకరించాలని ఆలయ మండపాలు కమిటీల వారికి అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఫైర్ డిపార్ట్మెంట్ తో పాటు గజ ఈతగాళ్ళని నిమజ్జనాలు పూర్తయి వరకు జలాశయం దగ్గర అందుబాటులో ఉంచాలని చక్కెర దేవరపల్లి టిడిపి నాయకులు అధికారులకు సూచించారు.