కుక్కునూరు
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరావి గూడెం గ్రామపంచాయతీలో ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో ఉపాధి హామీ పనుల గురించి చర్చించడం జరిగినది జాబ్ కార్డు లేనివారికి జాబ్ కార్డు పెట్టడం అమౌంట్ పడని వారికి అకౌంట్ చెక్ చేసి ఏ అకౌంట్లో పడినవో చెప్పడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పెదరావి గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కుంజా వెంకటమ్మ పెదరావి గూడెం గ్రామం ఎనిమిదో వార్డు నెంబర్ జనసేన పార్టీ గాడిద వెంకటేశ్వర్లు మరియు ఉపాధి హామీ పనులకు సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్ ప్రసాద్ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలత మరియు సచివాలయ సిబ్బంది అదేవిధంగా మెడికల్ క్యాంపుకు సంబంధించిన వారు కూడా మరియు కూటమి నాయకులు కార్యకర్తలు వీరాభిమానులు ఈ గ్రామసభను విజయవంతం చేయడం జరిగినది.