Subscribe Us

header ads

పట్టభధ్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి.. - ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్.


 జంగారెడ్డిగూడెం:-

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం నియోజకవర్గ పరిధిలోని పట్టభధ్రులంతా త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నమోదు చేసుకోవాలి అని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణ, మండల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 2021 నవంబర్ 1వ తేదీ లోపు ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు దీనికి అర్హులు అని అన్నారు అలాగే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వారికి పాత ఓటు ఉండదని కొత్తగా మరల నమోదు చేసుకోవాలి అని సూచించారు. 

యువత ఉద్యోగులు మేధావులు పెద్ద ఎత్తున ఓటు నమోదులో భాగస్వామ్యం అవ్వాలని కోరారు. దీనిలో భాగంగా ఓటు నమోదు కోసం సూర్య కళాశాలలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని దీనిని సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు.ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, సూర్య శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, రామ్ కుమార్, రాజ్ పాల్, రాము, మాధవరావు, రామచంద్రరాజు, ముస్తఫా, పరిమి సత్తిపండు, కిషోర్, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్స్, వార్డు, గ్రామ అధ్యక్ష కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.