Subscribe Us

header ads

కలకత్తా నగరంలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి.పి డిఎస్యు.

 
ఖమ్మం :ఖమ్మం నగరంలో పి డి ఎస్ యూనియన్ ఆధ్వర్యంలో ట్రైనీ డాక్టర్ పై  నిరసన,బదితురాలికి నివాళులర్పించారు.
కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారం అతిదారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి నామాల ఆజాద్ జిల్లా కార్యదర్శి వి వెంకటేష్ లు డిమాండ్ చేశారు.స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా పిడిఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన, అత్యాచార బాధితురాలికి నివాళి నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...78 ఏళ్ల భారత స్వాతంత్రదినోత్సవం జరుపుకొని అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నామని ప్రకటిస్తున్న పాలకులకు మహిళలకు రక్షణ కల్పించే దుస్థితి లేకపోవడం దుర్మార్గం అన్నారు.

విద్యావంతురాలు సమాజంలోప్రజల ఆరోగ్యం కాపాడటంలో తన వంతు పాత్ర పోషించాలనిముందుకు సాగడం కోసం వెళ్తున్నటువంటి ట్రైనీ డాక్టర్ పై కలకత్తా నగరానడిబొడ్డున హాస్పటల్లోనే అత్యాచారం జరగడం అనేటువంటిదిమహిళా రక్షణకు ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉన్నాయో అద్దం పడుతుందన్నారు. బేటి బచావో బేటి పడావో అంటూ ఒకరు మహిళా సాధికారత అంటూ మరొకరుప్రజలను మభ్యప్రజలను మభ్య పెట్టడం కోసంపేపర్ ప్రకటనల కోసం నినాదాలు చేస్తున్నారు తప్ప నిజంగామహిళల రక్షణ కోసము మహిళా సాధికారత కోసం కృషి చేయడం లేదని వారు దుయ్య
బట్టారు.తక్షణమే ట్రైన్ ఈ డాక్టర్ పై జరిగిన అత్యాచార హత్య ఘటనపై సమగ్రమైనటువంటి విచారణ జరిపి నిందితులను తక్షణమేకఠినంగా శిక్షించాలని,మౌమిత కుటుంబాన్ని ఆడుకోవాలని లేనియెడల ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. 
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు టి లక్ష్మణ్ నాయకులు రాజేశ్వరి మౌనిక అనిత అనుష చంద్రశేఖర్ శ్రీనివాస్ ప్రవీణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.