Subscribe Us

header ads

లైంగిక దాడి జరిగిన మైనర్ బాలికకు తక్షణమే న్యాయం చేయండి:


రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ 

నూజివీడు, మంజీరగళం ప్రతినిధి : ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలో గల పల్లెర్లమూడి గ్రామం లో మైనర్ బాలిక పై జరిగిన దాడి విదితమే.వివరాలలోకి వెళితే....నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో ఓ మైనర్ బాలికపై జరిగిన లైంగికదాడి ఘటనపై బాధిత కుటుంబాన్ని ఐద్య మహిళా సంఘం,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కలిసి మంగళవారం పరామర్శించారు.అనంతరం దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఐద్వా మహిళా సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో నూజివీడు ఆర్ డి ఓ కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రైతుసంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహా, ఐద్వా జిల్లా కార్యదర్శి శ్యామల రాణీ మాట్లాడుతూ.... పసి పిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు జరగడం క్షమించరానిదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. అపరిచిత వ్యక్తులతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తక్షణమే బాధిత పాపకు మెరుగైన వైద్యం అందించి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు శారదా, నండూరి పద్మంజలి, రైతుసంఘం నాయకులు రాంబాబు, శ్రీమన్నారాయణ, సి ఐ టి యూ నాయకులు హనుమాన్లు, సామియేలు పాల్గొన్నారు.