ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలంలో విషపు జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటిలో ఒక్కరిని కూడా విడచకుండా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్,కీళ్ల నొప్పులతో కూడిన విషపు జ్వరాలు ప్రజలను వణుకు పుట్టిస్తున్నాయి. వైద్య నిపుణులు గతంలో ఎన్నడూ ఇలాంటి విషపు జ్వరాలు చూడలేదని తేల్చి చెబుతున్నారు. ఇకపోతే కీళ్ల నొప్పులకు శాశ్వత వైద్యమే లేదని చేతులెత్తేస్తున్నారు. నెల రోజులు దాటిన వీడని జ్వరాలు, కీళ్ల నొప్పులు వైద్య ఖర్చుల నిమిత్తం అమ్ముకుంటున్న ఆస్తులు. గతంలో కోవిడ్ 19, కరోనా వచ్చి ప్రపంచమంతా వనికిపోయింది. ఇప్పుడు చూస్తే ఎన్నడూ లేని విధంగా విషపు జ్వరాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ప్రజలను జ్వరాల భారీ నుంచి బయట పడేయాలని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా దోమ కాటు వలనే ఈ కాలంలో జ్వరాలు ఇలా విజృంభిస్తాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.