తుండగా అర్ధరాత్రి హాస్టల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి పోలీసులు గుట్టుగా తనిఖీలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.స్నానాల గదిలో షవర్లు ఊడదీసి తరలించడం ఈ ఘటనకు అనుమానాలకు బలం చేకూర్చుతోందిని సీక్రెట్ కెమెరాలపై ఓ విద్యార్థిని వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం. వెనుక ఆంతర్యం ఏంటన్నారు.వాష్ రూమ్ ల్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారాన్ని ఓ విద్యార్థిని వారం రోజుల క్రితమే కాలేజీ యాజ మాన్యం దృష్టికి తెచ్చినా నిర్లిప్తంగా వ్యవహారించడం తో పాటు నిన్న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఫిర్యాదు చేస్తే విచారణకు నెల సమయం కావాలని మరియు ఫేక్ న్యూస్ అంటూ మళ్లీ రాత్రి ప్రచారం చేయడం దూర్మార్గం
మని వారు యాజమాన్యం పై వారు ఆవేదన వ్యక్తం చేశారు.యజమాన్యం దృష్టికి తెచ్చిన విద్యార్ధినిని తండ్రిని పిలిపించండంటూ రివర్స్ కేసులు పెడతామని బెదిరించడం ఏంటని విద్యార్థులు ఏమైనా తప్పు చేశారా? న్యాయం కోరడమే నేరమా? అని వారు ప్రశ్నించారు.కావున తక్షణమే ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రంగా స్పందించి నిందుతులను కఠినంగా శిక్షించాలని నిర్లక్ష్యం వహించిన కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులతో పాటు కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని లేని పక్షంలో విద్యార్థుల కు న్యాయం చేసే అంత వరకు పిడిఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ నాయకులు శ్రీను నరేందర్ యశ్వంత్ వెంకటేష్ లక్ష్మణ్ శ్రీ హరి తదితరులు పాల్గొన్నారు.