కొయ్యలగూడెం:-
ఏలూరుజిల్లా కొయ్యలగూడెం పరింపూడి పంచాయతీ కొయ్యలగూడెం టౌన్ కరెంటు లో వోల్టేజ్ తో ఇబ్బందులు పడుతున్న 1.పరింపూడి ఏరియా ప్రజలు 2.అశోక్ నగర్ ఏరియా ప్రజలపడుతున్న ఇబ్బందులవల్ల పంచాయతీ వారి అభ్యర్థనతో గౌరవ ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు కీ తెలియపరచగా వారు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించమని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది.
ఎలక్ట్రికల్ డిఇ వారు సుమారు 20 లక్షల రూపాయల విలువైన కొత్త ట్రాన్స్ఫార్మర్ పనులు మంజూరు చేశారు. ప్రజల సహకరించిన పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు కి, ఎలక్ట్రికల్ డిఇ, ఏఈ కి మరియు పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ మాదేపల్లి శ్రీను మరియు జన సైనికులు, ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.