Subscribe Us

header ads

ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం వరద బాధితులకు అండగా కంబాల శ్రీనివాసరావు


 గోకవరం :

గోకవరం సెప్టెంబర్4 ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ధైర్యం ఇస్తూ,ఎవరికీ కష్టం వచ్చినా తాను ఎల్లప్పుడు ముందుంటానని నిరూపిస్తున్నారు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు.భారీ వర్షాల కారణంగా వరదలో చిక్కుకొని ఆకలితో అలమటిస్తూ,అష్ట కష్టాలు పడుతున్న విజయవాడ వరద బాధితులకు కంబాల శ్రీనివాసరావు అండగా నిలిచారు.ఆయన మన దేశంలో లేనప్పటికీ విజయవాడలోని వాస్తవ పరిస్థితులు,వరదల్లో అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలను,వారి దయనీయ స్థితిని చూసి చలించి పోయారు,ఎవరికి కష్టమొచ్చినా తన కష్టంగా భావించే ఆయన తక్షణమే వరదలు చిక్కుకున్న బాధితులకు సహాయ సహకారాలు అందించాలని రామసేన సభ్యులను ఆదేశించారు.ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రామసేన సభ్యులు నిన్న సాయంత్రం నుంచి రాత్రి పగలు కష్టపడి,శ్రమించి 3,000 మందికి భోజనం ప్యాకెట్లు తయారుచేసారు. భోజనం ప్యాకెట్లను 6,000 వాటర్ ప్యాకెట్స్ ను రెండు వాహనాల్లో వారే స్వయంగా సంసిద్ధమై విజయవాడకు తరలి వెళ్లి వరద ప్రాంతాలైన రామరాజు నగర్, విద్యా ధారపురం,చిట్టినగర్,సింగ్ నగర్, కంసాలిపేట, పలు ప్రాంతాల్లోని వరద బాధితులకు రామసేన సభ్యులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస రావు ఆమెరికా నుంచి విడుదల చేసిన వీడియో ద్వారా మాట్లాడుతూ వరదల కారణంగా విజయవాడలో ఏర్పడిన దయనీయ పరిస్థితులు చూసి తనకు ఎంతో బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు రాత్రి పగలు తిరుగుతూ ప్రజా సేవలు అందిస్తున్నారని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరద బాధితులకు ఎన్నో సేవలందిస్తున్నారని అన్నారు. తను ఆమెరికా లో ఉన్నపటికి విజయవాడలోని ప్రజల పరిస్థితిలను చూసి నా మనసు అంత అక్కడే ఉందన్నారు.తమ వంతు సహాయంగా వరద బాధితులకు సహాయం చేయాలని రామసేన సభ్యులకు ఆదేశించగా, రామసేన సభ్యులు,దేవిచౌక్ సేవకులు,తన సిబ్బంది కలిసి రాత్రి పగలు శ్రమించి 3,000 మందికి భోజనం ప్యాకెట్లు తయారు చేసి, వాటితో పాటు ఆరువేల వాటర్ ప్యాకెట్లు రెండు వాహనాలలో స్వయంగా పంపిణీ చేయడానికి విజయవాడ బయలుదేరి వెళ్లారని తెలిపారు. రానున్న కాలంలో ఇటువంటి విపత్తు పరిస్థితులు మరల తలెత్తకూడదని దేవుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అనంతరం రామసేన సభ్యులు ఇనకోటి బాపన్న దొర, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతూ,ప్రతిక్షణం ప్రజలకు సేవ చేయడంలోనే తనకు ఆనందం ఉందని, పరితపించే ఏకైక వ్యక్తి విశ్వ హిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అని అన్నారు. 

గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ పరిసర ప్రాంతాలు జలమయం అయ్యి,ఆ ప్రాంతంలోని ఇళ్లు, భవనాలు,రోడ్లు నీటిలో మునిగిపోయి అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని,సహాయం కోసం అర్థిస్తున్న సన్నివేశాలను కంబాల శ్రీనివాసరావు చూసి, భావద్వేగాలకు లోనై తక్షణమే వారికి సాయం అందించాలని తమను ఆదేశించడం జరిగిందని తెలిపారు.రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎంతో కష్టపడి వరద బాధితులకు సహాయం చేస్తున్నప్పటికీ, తమ వంతు సహాయంగా బాధితులకు అండగా నిలుస్తున్నామని వెల్లడించారు.ఎంతో దూరం నుంచి విజయవాడ వచ్చి సహాయ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని వరద బాధితులకు ఆహారం, త్రాగునీరు అందించిన విశ్వ హిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావును,వారి సిబ్బందిని,విజయవాడ చెందిన పలు శాఖల అధికారులు అభినందించారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప, తామర్ల రాంబాబు,సత్తి వెంకట రెడ్డి, మందపాటి సతీష్, వానం శ్రీను,దేవి చౌక్ సేవకులు తదితరులు పాల్గొన్నారు.