జంగారెడ్డిగూడెం
ఏలూరుజిల్లా ఏపీటీఎఫ్.మండల అద్యుక్షులు ఐ వి. రత్నం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జంగారెడ్డిగూడెం జోన్ సమావేశం జోనల్ కన్వీనర్ యు.వి.నరసింహారాజు అధ్యక్షతన జంగారెడ్డిగూడెం లోని మండల ప్రాథమిక పరిషత్ పాఠశాల నందు జరిగింది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రెడ్డిదొర మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిన జీవో నెంబర్ 117 ను వెంటనే రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైంది కనుక ఆలస్యం చేయకుండా 1 నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో తెలుగు,ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలన్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించే విధంగా తల్లికి వందనం ను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు వర్తింపచేయాలని కోరారు. జోన్ చైర్మన్ యు.వి.నరసింహరాజు మాట్లాడుతూ 12వ పిఆర్సి అమలు జాప్యం అవుతున్నందువలన ఐ.ఆర్.ను ప్రకటించాలన్నారు. పిఎఫ్, ఏపీ జి ఎల్ ఐ రుణాలను సకాలంలో మంజూరు చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు,ఐటిడిఏ యాజమాన్యంలోని పండిట్ పీఈటి పోస్టులను ఉన్నతీకరించి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశానికి జోన్ కో-కన్వీనర్లు జె సోమేశ్వర శాస్త్రి, పివిఆర్ రాజ్యలక్ష్మి, ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగారెడ్డిగూడెం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐ.వి రత్నం, కే సుబ్బారావు, జిల్లా కౌన్సిలర్ వివి ప్రసాద్,సీనియర్ నాయకులు ఉమర్ ఆలీషా, కే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.