ఆగిరిపల్లి:-
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామంలోని అంగన్వాడి సూపర్వైజర్ సులోచన రాణి ఆధ్వర్యంలో కిష్టవరం గ్రామ సర్పంచ్ ముఖ్యఅతిథిగా అంతర్జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.బేటి బచావో బేటి పడావో కార్యక్రమం పై విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన నిర్వహించారు.అంగన్వాడీ సూపర్వైజర్ మాట్లాడుతూ ఆడపిల్లలు స్వేచ్ఛగా చదువుకోవాలని 18 సంవత్సరాలు నిండకముందే ఆడపిల్లలకు వివాహం జరిపించకూడదని.ముఖ్యంగా ఆడపిల్లలను చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడగలుగుతారని తల్లిదండ్రులకు అవగాహన కలిగించారు.
గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఆడపిల్లలు తెలిసి తెలియని వయసులో వివాహాలు చేస్తే అనారోగ్యంతో పాటు పిల్లలలో కూడా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కనుక వారిని స్వేచ్ఛాయుతంగా చదువుకోనివ్వాలని వారి పట్ల ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలను రూపొందిస్తుందని కనుక తల్లిదండ్రులు వాటి గురించి అవగాహన తెలుసుకొని ఆడపిల్లలను చదువుకోనివ్వాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.